Page Loader
AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు
సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

AP students: సరిహద్దు ఉద్రిక్తతల వేళ.. ఏపీ భవన్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలోని పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు స్వస్థలాల వైపు తిరుగుపయనమవుతున్నారు. ఇప్పటికే వీరిలో 350 మంది దిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి వరకు 91 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ, ఆదివారం నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన విద్యార్థులకు ఏపీ భవన్ అధికారులు తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు అందిస్తున్నారు. అంతేకాకుండా, రైలు టికెట్ కన్ఫర్మేషన్, ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు రవాణా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Details

మొబైల్ నంబర్లు ఏర్పాట్లు

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భవన్ సిబ్బంది నిరంతరం సహకరిస్తున్నారు. ఇక, దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఏపీ వాసులు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా, సహాయం కోసం దిల్లీ ఏపీ భవన్‌ను సంప్రదించవచ్చు. అధికారికంగా 011-23387089 నంబరుతో పాటు మొబైల్ నంబర్లు 98719 99430, 98719 99053లను అందుబాటులో ఉంచారు.