NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 
    ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన

    Delhi Stampede: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం.. రైల్వేశాఖ కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 17, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా భక్తుల తొక్కిసలాట విషాదం నింపింది.

    భక్తుల భారీ రద్దీ, సమాచారం లోపం వల్ల కలిగిన గందరగోళం కారణంగా ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు.

    ఈ ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

    ప్లాట్‌ఫామ్ టికెట్ల విక్రయాల నిలిపివేత

    ఘటన అనంతరం ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రద్దీ నియంత్రణ చర్యలు ప్రకటించారు.

    సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలను వారం పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.

    ఉదయం సమయంలో కూడా టికెట్ల విక్రయాన్ని పరిమితికి లోబడి నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

    Details

    దర్యాప్తు, సీసీటీవీ పరిశీలన

    రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ దర్యాప్తు చేపట్టింది.

    ప్లాట్‌ఫామ్ 14లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు, శనివారం రాత్రి 9 గంటల నుంచి 9:20 గంటల మధ్య ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌లో వేచి ఉన్నట్లు గుర్తించారు.

    స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కోసం గేటు వద్ద గుమికూడటం వల్ల తొక్కిసలాట ఏర్పడింది.

    అత్యధిక టిక్కెట్ల అమ్మకమే కారణమా?

    సాధారణంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో రోజుకు సుమారు 7,000 జనరల్ క్లాస్ టిక్కెట్లు అమ్ముతారు.

    కానీ ఈ విషాదకర రోజు 9,600కిపైగా టిక్కెట్లు అమ్మడంతో భారీ రద్దీ ఏర్పడి, తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    దిల్లీ

    Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌!  ఆటోమొబైల్స్
    Delhi Assembly Elections: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 699 మంది పోటీకి సిద్ధం.. అత్యధికంగా న్యూదిల్లీలో..! అసెంబ్లీ ఎన్నికలు
    Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు అతిషి మార్లెనా
    FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌ ఉత్తర్‌ప్రదేశ్

    ఇండియా

    Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు కేరళ
    Branded houses: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న బ్రాండెడ్ గృహాలు హైదరాబాద్
    Madhya Pradesh: ప్రియురాలిని చంపి 9 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన ప్రేమికుడు  మధ్యప్రదేశ్
    HMPV: అస్సాంలో 10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025