NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు 
    తదుపరి వార్తా కథనం
    Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు 
    రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు

    Amaravati: రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణ సహాయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్లు పిలిచింది.

    గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన, కానీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి బిడ్లు ఆహ్వానించారు.

    ఈ ప్రాజెక్టులలో మొత్తం రూ.2,791.31 కోట్ల విలువైన ఎనిమిది పనులు ఉన్నాయి.

    బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువును నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు.

    వివరాలు 

     ఆరు రాజధాని ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి పనులు 

    ఈ పనుల్లో రెండు పాలవాగు, గ్రావిటీ కాలువల పనులు ఉండగా, మిగిలిన ఆరు రాజధాని ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించినవిగా ఉన్నాయి.

    శ్రీ అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగు, అలాగే దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగును వెడల్పు, లోతు చేయనున్నారు.

    శాఖమూరులో రూ.462.26 కోట్ల వ్యయంతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయనున్నారు.

    రూ.303.73 కోట్ల వ్యయంతో 7.83 కి.మీ. నిడివిగల కాలువ నిర్మాణం మరియు 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేయబోతున్నారు.

    వివరాలు 

    సైకిల్ ట్రాక్‌లు, విద్యుత్, కమ్యూనికేషన్ తీగల కోసం డక్ట్‌ల ఏర్పాటు

    అదనంగా, రూ.372.23 కోట్లతో ఈ8 రోడ్డు, రూ.419.96 కోట్లతో ఈ9 రోడ్డు, రూ.241.67 కోట్లతో ఈ14 రోడ్డు, రూ.443.84 కోట్లతో ఎన్‌12 రోడ్డు, రూ.183.21 కోట్లతో ఎన్‌6 రోడ్డు, రూ.364.41 కోట్లతో ఈ3 రోడ్లను నిర్మించనున్నారు.

    రోడ్ల వెంట వాననీటి మళ్లింపు కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్లు, డ్రెయినేజీ వ్యవస్థలు, పచ్చదనం అభివృద్ధి, పాదచారులు, సైకిల్ ట్రాక్‌లు, విద్యుత్, కమ్యూనికేషన్ తీగల కోసం డక్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025