తదుపరి వార్తా కథనం
    
    
                                                                                TGPSC: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Sep 17, 2025 
                    
                     01:53 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది. మార్చి 10న విడుదల చేసిన మెయిన్స్ ఫలితాలు, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేయడం ద్వారా టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను సూచించింది. ఒకవైపు, మెయిన్స్ జవాబు పత్రాలను సుప్రీంకోర్టు సూత్రాల ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి.
Details
ఎనిమిది నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలి
లేకపోతే, 2024 అక్టోబరు 21-27 మధ్య నిర్వహించిన మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలి. ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలనే ఆదేశాలను సింగిల్ బెంచ్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.