16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్
దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రోహిణి ప్రాంతంలో అతడు ఆ బాలికను దాదాపు 20సార్లు కత్తితో పొడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలను విడిచింది. ఆ బాలిక, సాహిల్ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య జరగడానికి ఒక రోజు ముందు ఇద్దరు గొడవ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్లో అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నట్లు దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా తెలిపారు. 20ఏళ్ల సాహిల్ ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్గా పని చేస్తున్నట్లు వెల్లడించారు.