16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
రోహిణి ప్రాంతంలో అతడు ఆ బాలికను దాదాపు 20సార్లు కత్తితో పొడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలను విడిచింది.
ఆ బాలిక, సాహిల్ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. హత్య జరగడానికి ఒక రోజు ముందు ఇద్దరు గొడవ పడినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్లో అతడిని అరెస్టు చేశారు.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నట్లు దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుమన్ నల్వా తెలిపారు.
20ఏళ్ల సాహిల్ ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్గా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిందితుడి అరెస్టును వెల్లడించిన డీసీపీ నల్వా
#WATCH | We have arrested the accused, Sahil from Bulandshahr, Uttar Pradesh. He used to work as a mechanic for AC and Refrigerators. Further investigation is underway, We will make sure that the maximum punishment is given to the accused: Suman Nalwa, Deputy Commissioner of… pic.twitter.com/U2DQ83m1TD
— ANI (@ANI) May 29, 2023