NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త 
    నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త

    Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన వ్యక్తి. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

    ప్రకాశం జిల్లాలోని జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి, 13 ఏళ్ల క్రితం మాధవితో వివాహం అయ్యింది.

    అప్పట్లో ఆర్మీలో పనిచేస్తున్న అతను, 35 ఏళ్ల వయసులోనే రిటైర్‌ అయ్యాడు.

    హైదరాబాద్ మీర్‌పేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

    అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇవి మరింత తీవ్రరూపం దాల్చి, మోస్ట్‌ బ్రూటల్‌ మర్డర్‌కు దారితీసింది.

    వివరాలు 

    పండగ రోజే భార్యను కిరాతకంగా హతమార్చాడు

    గురుమూర్తి తన భార్య మాధవిని చంపాలని పక్కాగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం సంక్రాంతి సెలవులను ఈ నేరానికి ఎంచుకున్నాడు.

    తన పిల్లలను జనవరి 13న అత్తమామల ఇంటికి పంపించాడు. అపార్ట్‌మెంట్‌లోనూ చాలామంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

    ఈ సందర్బాన్ని ఆసరాగా తీసుకున్న గురుమూర్తి, జనవరి 15న పండగ రోజే భార్యను కిరాతకంగా హతమార్చాడు.

    ఆమెను చంపిన తరువాత, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడికించాడు.

    ఆ తర్వాత ఆ మాంసాన్ని ఎండబెట్టి పొడిగా మార్చి, జిల్లెల్లగూడలోని చందన చెరువులో పడేశాడు.

    వివరాలు 

    తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఘటన 

    ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జనవరి 16న మాధవి అత్తమామలతో ఫోన్‌ చేసి, ఆమె గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందని గురుమూర్తి చెప్పాడు.

    ఆమె తమ దగ్గరికి రాలేదని వారు చెప్పినప్పటికీ, అతను కంగారుగా నటిస్తూ తరచూ ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నాడు.

    కానీ, పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేయలేదు. జనవరి 18న మాధవి తల్లిదండ్రులు హైదరాబాదుకు వచ్చి పోలీసులను సంప్రదించారు.

    సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు, మాధవి ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ తిరిగి బయటకు రాకపోవడం గమనించారు.

    అనంతరం గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

    వివరాలు 

    సీసీటీవీ ఫుటేజ్‌ కీలక పాత్ర

    విచారణలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే.. పోలీసులే షాకయ్యారు. మాధవిని హతమార్చిన తర్వాత, ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడన్న విషయం వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

    హత్య జరిగినా, శవం ఆనవాళ్లు లేవు. నేరం చేసిందెవరో తెలిసినా, నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవు.

    ఒక సైకో క్రిమినల్ మైండ్‌తో చేసిన ఈ హత్య, షాకింగ్‌గా మారింది.

    గురుమూర్తి తన మిలటరీ అనుభవంతో హత్య తర్వాత ఆధారాలను పూర్తిగా నశింపజేశాడు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ కీలక పాత్ర పోషించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    హైదరాబాద్

    Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్.. పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్లాన్!  అల్లు అర్జున్
    Sandhya Theatre: సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పుష్ప 2
    Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల తెలంగాణ
    Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025