NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!
    తదుపరి వార్తా కథనం
    Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!
    జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!

    Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

    ఈ దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, వాటిలో 24 జమ్మూ డివిజన్‌లో, 16 కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి.

    ఈ ఎన్నికల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    మొతం 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.

    Details

    అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు

    370వ అధికరణం రద్దు అనంతరం పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజం, గూర్ఖా తెగలవారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

    జమ్మూ డివిజన్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో హిందూ మెజారిటీ కలిగిన జమ్మూ, సాంబా, కథువా, ఉదంపూర్ జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది.

    415 మంది అభ్యర్థులలో ముఖ్యులుగా మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్‌లు ఉన్నారు.

    అంతేకాక పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్ కూడా ప్రధాన పోటీలో ఉన్నారు.

    ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అక్టోబర్ 5న, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    పోలింగ్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    జమ్ముకశ్మీర్

    Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి  భారతదేశం
    J&K: కథువా ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం.. ఐదు రోజుల్లోనే రెండో దాడి భారతదేశం
    J&K : దోడాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు భారతదేశం
    Kathua terror attack: జమ్ములో హింసాకాండ పెరగడం వెనుక ఆంతర్యం ఏమిటి?   భారతదేశం

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025