Page Loader
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను పీఎంఓ అందించాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు తీర్పు

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Stalin
Mar 31, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. మోదీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వివరాలను అందించాలని ప్రధాన సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలను జస్టిస్ బీరెన్ వైష్ణవ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికేట్ వివరాలను కోరిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గుజరాత్ హైకోర్టు రూ.25,000 జరిమానా కూడా విధించింది.

ప్రధాని మోదీ

1978లో గుజరాత్ విశ్వవిద్యాలయంలో మోదీ గ్రాడ్యుయేషన్ పూర్తి

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు విచారించింది. ప్రజాస్వామ్యంలో పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్, నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదని, ఈ అంశంలో ప్రజాప్రయోజనాల ప్రమేయం లేదని, అతని(మోదీ) గోప్యత కూడా దెబ్బతింటుందని ధర్మానసం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ 1978లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, 1983లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.