NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 
    ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

    Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 01, 2024
    12:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది.

    1999లో జరిగిన సర్వే ద్వారా ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించిన తర్వాత, ఆ స్థలాల్లో నిర్మాణాలు చేసినవారికి ఎలా నోటీసులు ఇవ్వగలరని పేర్కొంది.

    మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టినా చట్టం ప్రకారం ఉండాలని ఆదేశించింది.

    మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు మార్కింగ్ చేసిన నేపథ్యంలో అనేక పిటిషన్‌ల ద్వారా అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలని కోరారు.

    ఈ పిటిషన్‌లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ జరిపారు.

    Details

    2100 మంది బాధితులు ఉన్నారన్న కలెక్టర్

    ప్రభుత్వ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి, ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడం లేదని వివరించారు.

    ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. దీనిపై బాధితులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారు సుమారుగా 2,100 మంది ఉన్నారని కలెక్టర్ గుర్తించారు.

    ప్రస్తుతం ఎలాంటి తొలగింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. న్యాయమూర్తి, చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు.

    ప్రజలకు నమ్మకం కలిగించడానికి చర్యలు తీసుకోవాలనే హెచ్చరించారు. అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడితే చట్టం ప్రకారం చేయాలని సూచిస్తూ విచారణను అక్టోబర్ 16కి వాయిదా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైకోర్టు

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    తెలంగాణ

    Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల  కరీంనగర్
    New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్‌ నుంచి దరఖాస్తులు  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు  హైదరాబాద్
    Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ హైదరాబాద్

    హైకోర్టు

    Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడు
    Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా చంద్రబాబు నాయుడు
    Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ ఆంధ్రప్రదేశ్
    Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025