NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!
    తదుపరి వార్తా కథనం
    Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!
    కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

    Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. ఒక్క కుటుంబానికే రూ. 30 కోట్లు లాభం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 05, 2025
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా స్పందించారు.

    ముఖ్యంగా పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా లాభం లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చారు.

    రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం యోగి, మహాకుంభమేళా సనాతన ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించిందని వివరించారు.

    కుంభమేళా లాభాలు ఎలా ఉన్నాయంటే

    ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని, కుంభమేళా 45 రోజుల్లో ఆ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాన్ని అందుకుందన్నారు.

    అంటే ఒక్కో పడవ రూ.23 లక్షల లాభాన్ని సాధించిందని, రోజుకు సగటున రూ.50,000 నుంచి రూ.52,000 ఆదాయం వచ్చినట్లు వివరించారు.

    Details

     కుంభమేళా భద్రతా వివరాలు 

    ఈ మహాకుంభమేళాకు 45 రోజుల్లో 66 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని యోగి స్పష్టం చేశారు.

    ఒక్క తొక్కిసలాట ఘటన మినహా, మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్యల వంటి నేరాలు ఒక్కటీ నమోదు కాలేదని వెల్లడించారు.

    కుంభమేళా నిర్వహణ కోసం మొత్తం రూ.7,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఈ భారీ ఉత్సవం ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలిపారు.

    Details

    ఆర్థిక లాభాలు ఇవే

    హోటల్‌ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం

    ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు

    రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం

    విరాళాల రూపంలో రూ.660 కోట్లు

    జాతీయ రహదారుల టోల్ ట్యాక్స్ ద్వారా రూ.300 కోట్లు

    ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం

    దేశ స్తూలజాతీయోత్పత్తిలో (GDP) కుంభమేళా తన వంతు వాటాను అందించిందని సీఎం యోగి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    ఉత్తర్‌ప్రదేశ్

    Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..?  లైఫ్-స్టైల్
    Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు భారతదేశం
    Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'  భారతదేశం
    Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్  భారతదేశం

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025