చంద్రయాన్-3కి కౌంట్డౌన్ విపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూత
శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాల కోసం కౌంట్డౌన్ల వెనుక స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి గుండెపోటుతో మరణించారు. జులై 14వతేదీన శ్రీహరికోటలో చంద్రయాన్-3 మిషన్ను ప్రయోగ సందర్భంగా ఆమె చివరిగా కౌంట్డౌన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆగస్టు 23న, ల్యాండర్ మాడ్యూల్ (LM), విక్రమ్ ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలం పైన దిగి,ఈ ఘనతను సాధించిన నాల్గవ దేశంగా నిలిచింది. దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా నిలిచింది. ఇదిలా ఉండగా, చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ను స్లీప్ మోడ్ లోకి పంపినట్లు ఇస్రో శనివారం తెలిపింది. 14 రోజుల తర్వాత మేల్కొలపాలని అంతరిక్ష సంస్థ భావిస్తోంది.