NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ
    లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ

    AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 18, 2025
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

    ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తాజా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

    2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం ధరలను భారీగా పెంచడం, ప్రభుత్వమే మద్యం విక్రయించేలా పాలసీని మార్చడం, మద్యం తతంగంలో భారీ స్కామ్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

    Details

    లిక్కర్ స్కాంలో బాంబ్‌షెల్‌ 

    2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మద్యం ధరలను అమాంతం పెంచేసింది.

    సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా మద్యం పాలసీని మార్చి, ప్రభుత్వమే విక్రయించేలా వైన్‌ షాపుల‌ను ఏర్పాటు చేసింది.

    అయితే వీటి ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయం సంపాదించినప్పటికీ, తక్కువ నాణ్యత గల బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

    నిజమెంటో బయటపెట్టిన సిట్‌ దర్యాప్తు

    సిట్‌ దర్యాప్తులో రూ. 3 వేల కోట్ల స్కాం వెలుగు చూసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిల కనుసన్నల్లో ఈ లావాదేవీలు జరిగాయని తేలింది.

    ప్రభుత్వానికి గుట్టుగా పెద్దమొత్తంలో ముడుపులు చేరినట్లు ఆధారాలు లభించాయి.

    Details

    వైసీపీ నాయకులే టార్గెట్ 

    మద్యం స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. స్కాంలో తన ప్రమేయంపై విచారణ జరుగుతుందనే భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

    మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారని ప్రచారం జరుగుతోంది.

    ఆయన వాంగ్మూలం వల్ల వైసీపీ పెద్దలు ఇరకాటంలో పడతారనే ఊహాగానాలు ఉన్నాయి.

    ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు దారిపట్టిన మిథున్ రెడ్డి

    సిట్‌ విచారణ వేగంగా సాగుతుండటంతో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

    గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీల లావాదేవీలను తనే పర్యవేక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇవి నిరాధారమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    బడ్జెట్ సమావేశాల వరకు తనను అరెస్టు చేయొద్దని, కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోరారు.

    Details

    వైసీపీకి మద్యం స్కామ్ షాక్ 

    ఈ స్కాంలో మరింత మంది వైసీపీ నేతలు ఇరుక్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ఇప్పటికే సిట్‌ కీలక ఆధారాలు సేకరించగా, త్వరలోనే మరింత మందిని విచారించే అవకాశం ఉంది.

    మద్యం స్కాంలో వైసీపీ పెద్దలు చిక్కుకుతీరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైసీపీ

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    ఆంధ్రప్రదేశ్

    Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు! భారతదేశం
    AP Assembly: 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి.. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం భారతదేశం
    Visakhapatnam: రుషికొండ బీచ్‌ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం విశాఖపట్టణం
    TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. తిరుమల అన్నప్రసాదంలో కొత్త మెను తిరుమల తిరుపతి దేవస్థానం

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025