NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు 
    తదుపరి వార్తా కథనం
    మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు 
    మద్యం పాలసీ కేసులో ఆప్‌ను నిందితుడిగా చేర్చాలని సుప్రీం కోర్టుకు చెప్పనున్న దర్యాప్తు సంస్థ

    మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 05, 2023
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చబోతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది.

    మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కేసులో లబ్ధిదారునిగా ఆరోపించబడిన రాజకీయ పార్టీ ఆప్‌ని ఎందుకు నిందితుడిగా చేర్చలేదో స్పష్టం చేయాలని దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు అడిగిన ఒక రోజు తర్వాత ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.

    పీఎంఎల్‌ఏ విషయంలో కేసు మొత్తం ఓ రాజకీయ పార్టీకి సంబంధించి ఉందని అయితే ఆ రాజకీయ పార్టీ ఇప్పటికీ నిందితుడు కాదని అలాంటప్పుడు దానిపై ఎటువంటి సమాధానం ఇస్తారని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం సీబీఐ, ఈడీ తరుపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది.

    Details 

    సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించిన కోర్టు 

    సిబిఐ,ఈడి దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు విచారించింది.

    క్యాబినెట్ నోట్స్,నిర్ణయాల న్యాయబద్ధతపై కోర్టుకు తెలియజేయాలని కూడా బెంచ్ ASG రాజును కోరింది.

    ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఢిల్లీ నివాసంలో 10 గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

    Details 

    ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు: అతిషి

    ఈ పరిణామంపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్పందిస్తూ, 'మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లపై ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

    అందుకే, ఈ కేసులో ఆప్ పార్టీని నిందితులుగా చేయాలని వారు భావిస్తున్నారని అన్నారు.

    15 నెలల విచారణ తర్వాత కూడా సిసోడియా, సింగ్‌లపై ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం ఈడీ చేస్తున్న ఆరోపణలే అని ఆమె ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ లిక్కర్ స్కామ్‌
    సుప్రీంకోర్టు

    తాజా

    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి

    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు తాజా వార్తలు
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత

    సుప్రీంకోర్టు

    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  మసీదు
    కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్‌ప్రదేశ్
    బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా గుజరాత్
    లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ సీబీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025