NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 
    భారతదేశం

    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    June 06, 2023 | 11:16 am 1 నిమి చదవండి
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు 
    ప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు

    ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్య‌త్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. స్టేషన్ రిలే గదులు, కాంపౌండ్స్ హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాలు తప్పనిసరిగా 'డబుల్ లాకింగ్' ఏర్పాట్లు కలిగి ఉండేలా చూసుకోవాలని భారతీయ రైల్వే సర్క్యులర్‌ జారీ జారీ చేసింది. ఈ మేరకు రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ పరిధిలోని అన్ని 'గూమ్టీలు' (ట్రాక్‌ల వెంబడి గదులు), హౌసింగ్ సిగ్నలింగ్ పరికరాలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే సేఫ్టీ డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ ఆదేశించింది. ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే వ్యవస్థలోని అన్ని లోపాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.

    జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు రైల్వే శాఖ కీలక సూచనలు

    స్టేషన్‌లలోని అన్ని రిలే గదులను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. 'డబుల్ లాకింగ్ అరేంజ్‌మెంట్' సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి. రిలే రూమ్‌లలో 'డేటా లాగింగ్, డోర్ తెరవడం/మూసివేయడం కోసం ఎస్ఎంఎస్ అలర్ట్‌ ద్వారా తనిఖీ చేసి, నిర్ధారించుకోవాలి. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ పరికరాల డిస్‌కనెక్ట్, రీకనెక్షన్ సిస్టమ్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలని రైల్వే ఆదేశించింది. డ్రైవ్ సమయంలో గుర్తించిన అన్ని లోపాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డ్రైవ్ ఫలితాలను జూన్ 14 లోపు బోర్డుకి పంపాలని ఆదేశించింది. అలాగే ఒడిశా ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వారందరినీ మంగళవారం విచారణకు పిలిచినట్లు రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న యాభై నాలుగు మంది అధికారులను విచారణకు పిలిచారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రైలు ప్రమాదం
    ఒడిశా
    రైల్వే శాఖ మంత్రి
    తాజా వార్తలు

    రైలు ప్రమాదం

    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  ఒడిశా
    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  ఒడిశా
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  ఒడిశా

    ఒడిశా

    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా ప్రధాన మంత్రి
    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో రైలు ప్రమాదం
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన రైలు ప్రమాదం

    రైల్వే శాఖ మంత్రి

    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే భారతదేశం
    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు  రైలు ప్రమాదం
    తెలుగు ప్రజలకు తీపి కబురు... 2 సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు ఆమోదం భారతదేశం

    తాజా వార్తలు

    కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం  ప్రభుత్వం
    భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్  అమెరికా
    రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు రక్షణ శాఖ మంత్రి
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  గుంటూరు జిల్లా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023