NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
    ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 20, 2025
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.

    ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో బీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య సేవలు అందించే ప్రతిపాదనలపై పని జరుగుతోంది.

    ప్రస్తుతానికి బీపీఎల్ కుటుంబాలకే ఈ సేవలు అందుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఏపీఎల్ కుటుంబాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉంది.

    ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.

    Details

    దారిద్య్ర రేఖకు దిగువన 1.43 కోట్ల కుటుంబాలు

    ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈ ఆరోగ్య బీమా సేవలు ఉచితంగా అందించేందుకు ముసాయిదాను ఆరోగ్యశాఖ రూపొందించగా, ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనల సాధ్యతను పరిశీలిస్తోంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయని అధికారికంగా అంచనా. వీరికి ఇప్పటికే ఉచితంగా పథకాలు అమలవుతున్నాయి.

    ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్‌ఎస్‌ (Employees Health Scheme) మాదిరిగానే, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు దాదాపు 19-20 లక్షల కుటుంబాలకు కూడా ఈ బీమా వర్తింపజేస్తారు.

    Details

    బీమా విధానంలో 2,250 రకాల చికిత్సలు

    ఆదాయ ప్రమాణం లేకుండా అందరికీ ఈ సేవల విస్తరణపై దృష్టి సారించారు.

    కొత్త పథకం ప్రకారం, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు బీమా కంపెనీల ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు.

    రూ.2.5 లక్షలు మించిన చికిత్సల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు "హైబ్రిడ్ మోడల్" ద్వారా మద్దతు ఇస్తుంది.

    మొత్తం రూ.25 లక్షల వరకు సేవలు అందుబాటులో ఉండేలా చేస్తారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఇప్పటికే ఏడాదికి రూ.25 లక్షల విలువైన చికిత్సలు ఉచితంగా లభ్యమవుతున్నాయి.

    ప్రస్తుతం బీమా విధానంలో 2,250 రకాల చికిత్సలు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 770 చికిత్సలు అందిస్తున్నారు.

    Details

    సీఎం ఆమోదం అనంతరం టెండర్లు

    మొత్తం 3,257 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. అయితే ట్రస్ట్ ద్వారా అందించే 770 చికిత్సలు అత్యవసరమైనవిగా లేవన్న కారణంతో ఆర్థిక భారం తగ్గించేందుకు వీటిని ప్రత్యేకంగా ట్రస్ట్‌ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

    అసుపత్రుల అభ్యంతరాలు, చికిత్సల ఖర్చులపై సమగ్ర అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం టెండర్లు ఆహ్వానించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.

    నెట్‌వర్క్ ఆసుపత్రులు మాత్రం ప్రస్తుతం బీమా మోడల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల రేట్లను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి.

    ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా సేవల నమూనాగా ఏపీ రాష్ట్రం నిలవనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఆంధ్రప్రదేశ్

    AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు నారా లోకేశ్
     Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు! అమరావతి
    #NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కొనసాగుతున్న వివాదం: మారుతున్న రాజకీయ నిర్ణయాలు భారతదేశం
    AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!  వైసీపీ

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు  అమరావతి
    AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆంధ్రప్రదేశ్
    Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025