NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
    హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2023
    03:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు సందర్శించింది. రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు ప్రయాణించారు.

    రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడిన కమిటీకి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో పాటు ఎల్అండ్‌టీ ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి మెట్రో రైలు గురించి వివరించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ మెట్రో సాధించిన మైలురాళ్ల గురించి ఎంపీలకు వారు చెప్పారు.

    హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా పీపీపీ విధానంలో నిలిచిందని, ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎన్‌వీఎస్‌ రెడ్డి కమిటీ సభ్యులకు తెలియజేశారు.

    హైదరాబాద్ మెట్రో

    ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ విశేషాలను వివరించిన ఎన్‌వీఎస్ రెడ్డి

    అమీర్‌పేట్ స్టేషన్‌లోని షాపింగ్ మాల్, ఇతర సౌకర్యవంతమైన దుకాణాలను హౌసింగ్, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులకు దగ్గరుండి చూపించారు. ఇవి ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు మెట్రో యాజమాన్యానికి ఆదాయాన్నికూడా సమకూరుస్తుడటంపై సభ్యులు ప్రశంసించారు.

    100శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ విశేషాలను కూడా ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. సర్వే, ఇతర ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టును గ్రౌండింగ్ చేస్తామని ఆయన సభ్యులకు ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు.

    హైదరాబాద్ మెట్రోను సందర్శించిన వారిలో ఆర్ గిరిరాజన్, రామ్ చందర్ జాంగ్రా, కవితా పటీదార్, బెన్నీ బెహనన్, శంకర్ లాల్వానీ, మసూది తదితరులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    హైదరాబాద్

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం టర్కీ
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు సికింద్రాబాద్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025