NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!
    భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!

    Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 04, 2025
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి.

    పలు బస్తీల్లో రహదారులు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్‌పాస్ వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

    నాలాలు పొంగిప్రవహించాయి, రహదారులు చెరువులను తలపించాయి.

    మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం ఉరుములు, మెరుపులు, పిడుగులతో మరింత తీవ్రత ఏర్పరచింది, దీంతో నగరంలోని జనజీవనం స్థంభించింది.

    Details

    పాక్షికంగా దెబ్బతిన్న చార్మినార్

    ఎల్బీనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నారాయణగూడ నుంచి రాష్ట్ర సచివాలయం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరదనీరు రహదారులను ఆక్రమించింది.

    వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి.

    కొన్ని చోట్ల చెట్లు కార్లపై పడగా, అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో అనేక చోట్ల విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి.

    నగరంలో వర్షం ధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ పాక్షికంగా దెబ్బతింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.

    అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    Details

    నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు మృతి

    నాలుగేళ్ల కిందట మరమ్మతులు చేపట్టిన ప్రాంతంలోనే మళ్లీ నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. ఈ భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

    నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లెలో పొలంలో పనిచేస్తున్న గాజుల వీరమ్మ (60), సుంకరి సైదమ్మ (45)లు పిడుగుపాటుకు బలయ్యారు.

    మరొకరు గాయపడగా, అతనికి చికిత్స అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్నవెంకటేశ్వర్లు (41) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

    ఇదే జిల్లాలో వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామానికి చెందిన మహేంద్ర (19) పశువులను తోలుకుని ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు బలయ్యాడు.

    సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గోడకూలి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఇమ్మత్‌ఖాన్ (50) మరణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    హైదరాబాద్

    Hyderabad: నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. చెరువులో పడేసి.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త  భారతదేశం
    Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు హై అలర్ట్.. జనవరి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ విమానాశ్రయం
    Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు సైబర్ నేరం
    GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025