NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
    ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

    Telangana : ఫిబ్రవరిలోనే విజృంభిస్తున్న ఎండలు.. ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 17, 2025
    09:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈసారి వేసవి గతంలో కంటే మరింత ఉగ్రరూపం దాల్చనుందని తెలంగాణ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తించగా, మార్చి 15 తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

    గడిచిన వారం రోజులలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

    ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతే, ఏప్రిల్, మే నాటికి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటాయని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.

    Details

     జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు 

    రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 35.7°C నుంచి 37.7°C మధ్య నమోదయ్యాయి.

    వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

    ఖమ్మం జిల్లా రావినూతలలో 37.7°C గరిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదవగా, జనగామలో 35.7°C కనిష్ఠంగా నమోదైంది.

    అలాగే పెద్దపల్లి జిల్లాలో 37.6°C, భద్రాద్రి, జగిత్యాల, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 37.5°C చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ  ఆంధ్రప్రదేశ్
    Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ బీజేపీ
    Ashwini Vaishnav: తెలంగాణకు మరెన్నో వంద్ భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Telangana: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్‌ అశ్విని వైష్ణవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025