NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 
    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

    వ్రాసిన వారు Stalin
    Jun 09, 2023
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

    ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్నా, మళ్లీ ఎందుకు దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.

    సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానివ్వండని న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, రాజేష్ బిందాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది.

    ఇద్దరు మణిపురి నివాసితులు చోంగ్తామ్ విక్టర్ సింగ్, వ్యాపారవేత్త మాయెంగ్‌బామ్ జేమ్స్ తరఫున తరఫు న్యాయవాది షాదన్ ఫరస్ట్ పటిషన్ దాఖలు చేశారు.

    మణిపూర్

    ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల జీవనోపాధిపై ప్రభావం

    రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల తమ జీవితాలు, జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైందని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. మణిపూర్‌లో గత 35 రోజులకు పైగా ఇంటర్నెట్ మూసివేయబడిందన్నారు.

    ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక, మానవతా, సామాజిక, మానసిక ప్రభావం పడిందని పిటిషన్‌లో వెల్లడించారు. ప్రజలు తమ పిల్లలను పాఠశాలకు పంపలేకపోతున్నారని, బ్యాంకుల నుంచి నిధులు పొందలేకపోతున్నారని, ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయినట్లు పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    మణిపూర్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి మాట్లాడుతూ, హైకోర్టు ఇప్పటికే కొన్ని విషయాలపై విచారణ జరుపుతోందని, ఈ కేసును విచారించే అత్యవసరం లేదని అన్నారు. దీంతో పిటషనర్ల వాదనలకు సంతృప్తి చెందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాజ్యాన్ని కోట్టివేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు
    హైకోర్టు

    తాజా

    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్
    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఇంఫాల్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  ఆర్మీ

    సుప్రీంకోర్టు

    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా కల్వకుంట్ల కవిత
    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం
    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీ‌ఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?  ఆర్ బి ఐ
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025