NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన
    తదుపరి వార్తా కథనం
    Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన
    దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన

    Air Pollution: దిల్లీలో ఆంక్షల సడలింపునకు నో చెప్పిన సుప్రీం కోర్టు.. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 25, 2024
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

    గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

    GRAP-4 అమలుతో నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమైంది.

    దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు సెస్‌ను ఉపయోగించాలని ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.

    కాలుష్యం వల్ల పాఠశాలలు మూసివేసి ఆన్‌లైన్ విద్యను అమలు చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం రద్దు కావడం, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలను న్యాయస్థానం గమనించింది.

    Details

    శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు

    విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)ను సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

    దిల్లీలో వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడినా, చాలాచోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300కు పైగా ఉండటంతో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది.

    కాలుష్యంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

    చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి వరకు పాఠశాలలు మూసివేసి, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    ప్రస్తుత పరిస్థితుల్లొ GRAP-4 అమలు కీలకమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గాలి నాణ్యత మెరుగయ్యే వరకూ ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తి లేదని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    దిల్లీ

    Vikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి  అరెస్టు   భారతదేశం
    Delhi Blast: దిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ స్కూల్ వెలుపల భారీ పేలుడు  భారతదేశం
    Gun Firing: ఈశాన్య ఢిల్లీ వెల్‌కమ్ ఏరియాలో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ఒక మహిళకు  గాయలు  భారతదేశం
    Air quality: దిల్లీలో దారుణంగా క్షీణించిన గాలి నాణ్యత.. 'వెరీ పూర్' ఎయిర్ క్వాలిటీ వాయు కాలుష్యం

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025