NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం 
    తదుపరి వార్తా కథనం
    Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం 
    Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం

    Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2024
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర మత్స్య,పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖల మంత్రి పర్షోత్తం రూపాల(Parshottam Rupala) ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటలపాటు చిక్కుకుపోయింది.

    మత్స్యకారులు వేసిన వలలో పడవ ఇరుక్కుపోయి ఉంటుందని ముందుగా అనుమానించగా, ఆ తర్వాత వారు నీలిమడుగులో దారి తప్పిపోయారని మంత్రి రూపాలా స్పష్టం చేశారు.

    11వ విడత 'సాగర్ పరిక్రమ' కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో మమేకమయ్యేందుకు ఒడిశా పర్యటనకు వచ్చిన మంత్రిని సతపద నుంచి ప్రభుత్వం మరో నౌకలో పంపింది.

    ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపడా వరకు సరస్సు ఒడ్డున ప్రయాణిస్తున్న మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఇతర స్థానిక పార్టీ నాయకులు కూడా పడవలో చిక్కుకుపోయారు.

    Details 

    రూపాలా హాజరు కావాల్సిన కార్యక్రమం రద్దు 

    సరస్సు మధ్యలో, నలబానా పక్షుల అభయారణ్యం సమీపంలో,పడవ సుమారు రెండు గంటలపాటు చిక్కుకుపోయిందని మంత్రి కాన్వాయ్ డ్యూటీలో మోహరించిన భద్రతా అధికారి తెలిపారు.

    పూరీ జిల్లాలోని కృష్ణప్రసాద్ ఏరియా సమీపంలో జరిగే కార్యక్రమానికి రూపాలా హాజరు కావాల్సి ఉండగా, ఈ ఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది.

    రూపాలా రాత్రి 10.30 గంటలకు పూరీకి చేరుకున్నారని అధికారి తెలిపారు. అంతకుముందు గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ హార్బర్‌లో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    పరదీప్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్ కోసం ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి రూపా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఒడిశా

    ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు  రైల్వే శాఖ మంత్రి
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  రైలు ప్రమాదం
    దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన రైలు ప్రమాదం
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025