NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
    తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!

    Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 15, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.

    సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.

    ఈ నేపథ్యంలో, తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని, ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

    తిరుమల లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉంటున్న నేపథ్యంలో, కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

    Details

    ఏపీ నుంచి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి

    ఈ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

    సీబీఐ నుండి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఇండియా నుండి ఓ అధికారి సిట్‌లో ఉండాలని వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పంపిన సభ్యులలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ శెట్టి పేర్లు ఉన్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

    ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటుచేసిన సిట్‌లో ఈ ఇద్దరు సభ్యులు ఉన్నారు. మొత్తం 9 మంది సభ్యులతో ఏర్పడిన ఈ బృందం తిరుమలను సందర్శించి విచారణ చేపట్టింది.

    ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    సుప్రీంకోర్టు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    సుప్రీంకోర్టు

    Supreme Court: సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి వ్యాఖ్యను తొలగించిన సుప్రీంకోర్టు భారతదేశం
    Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా? దిల్లీ
    #NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?  కేంద్ర ప్రభుత్వం
    Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు కోల్‌కతా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025