NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం
    తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం

    Telangana: తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చుట్టూ నీళ్లు.. మధ్యలో బస ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది కాదూ!

    ఆ ఊహను నిజం చేసేలా, పర్యాటకులకు స్వర్గధామంలా మారిపోయింది లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం.

    ఇప్పటికే సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను ఆకర్షిస్తున్న ఈ పర్యాటక ప్రదేశం, ఇది మరో కలికితురాయి కానుంది.

    ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం జలాశయం, సుమారు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపాన్ని (ఐలాండ్‌) టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్‌ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసింది.

    పర్యాటకుల ఆహ్లాదం కోసం పచ్చని ఉద్యానవనాలను రూపొందించారు. ఇందులో 22 కాటేజీలను ఏర్పాటు చేశారు, అందులో నాలుగింటిని కుటుంబ సభ్యులతో బస చేసేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

    వివరాలు 

    పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు

    ఈ ద్వీపంలో ఐదు ఈత కొలనులు ఉన్నాయి, నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు.

    పిల్లల కోసం ప్రత్యేక ఈత కొలువు, ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర వసతులు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు.

    ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, శిమ్లా, మున్నార్ వంటి ప్రదేశాలను తలపించేలా ఈ ద్వీపాన్ని అందంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

    ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమారు 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. దీన్ని త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

    వివరాలు 

    లక్నవరం సరస్సు: ప్రకృతి అందాలకు నిలయంగా 

    హైదరాబాద్ నుంచి 210 కి.మీ దూరంలో, వరంగల్ నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నవరం లేక్‌ ఉన్నది.

    దట్టమైన అడవుల మధ్య కొండల కిచ్చున ఈ సరస్సు ప్రకృతి అందాలను అనుభవించడానికి ఒక ప్రత్యేక స్థలంగా నిలుస్తుంది.

    ఈ సరస్సు కాకతీయుల కాలానికి చెందినది. చరిత్ర ప్రకారం, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ సరస్సును తవ్వించాడు.

    లక్నవరం సరస్సు చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రాకుండా ఉండరు.

    లక్నవరం సరస్సులో, ద్వీపాలు మరియు కేబుల్ బ్రిడ్జిలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ములుగు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ములుగు

    Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం లోక్‌సభ
    Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క ఎమ్మెల్యే
    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు  తాజా వార్తలు
    Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025