Page Loader
South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!

South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) సాధారణ తేదీ కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించిన సమాచారం ప్రకారం, మే 27న కేరళను రుతుపవనాలు తాకే అవకాశముందని అంచనా. సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించే ఈ రుతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అనంతరం వాయవ్య భారతంలో సెప్టెంబరు 17 నుంచి ఉపసంహరణ ప్రారంభమై అక్టోబరు 15 నాటికి పూర్తవుతుంది. రెండు మూడు సంవత్సరాల లెక్కలు చూస్తే.. 2023లో జూన్ 8న, 2022లో మే 29న రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. ఇక ఈ ఏడాది మే 27నే ఇవి ప్రారంభం కానుండటం విశేషం.

Details

ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం

ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాక, ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వచ్చిన ఊహాగానాలను ఐఎండీ తిప్పికొట్టింది. భారత్‌లో వర్షపాతం ఇప్పటికీ వ్యవసాయానికి ప్రాథమిక ఆధారంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నికర సాగు భూమిలో 52 శాతం భాగానికి వర్షపాతమే ఆధారం. ఇదే భూముల నుంచి దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం దిగుబడి వస్తోంది. వర్షపాతం పెరగడం వలన తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే జలాశయాలు నిండే అవకాశముండటం, దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ఇది సాయపడనుండటం స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ జీడీపీకి సుమారు 18.2 శాతం మేరకు సానుకూల ప్రభావం కనిపించవచ్చని అంచనా.