NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
    భారతదేశం

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 21, 2023, 05:55 pm 0 నిమి చదవండి
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్

    మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. జనవరి 14న కూడా దావూద్ సభ్యుడనని గడ్కరీ నివాసం, కార్యాలయానికి ఓ వ్యక్తి ఇలాంటి కాల్స్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. 14వ తేదీన ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య గడ్కరీ పీఆర్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూడు బెదిరింపు కాల్‌లు వచ్చాయి.

    సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు

    జనవరిలో బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇల్లు, కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే మంత్రిని బాంబుతో సమాధానం చెబుతానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. అయితే కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారి అనే వ్యక్తి అని ఆ తర్వాత పోలీసులు గుర్తించారు. మరో సంఘటనలో గడ్కరీని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే ఆరోపణలపై నాగ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్ పోలీసుల సైబర్ సెల్ నిందితుడిపై కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసింది దత్తాత్రే జోషి అని తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    మహారాష్ట్ర
    నితిన్ గడ్కరీ
    కేంద్రమంత్రి
    నాగపూర్

    మహారాష్ట్ర

    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; 144 సెక్షన్ విధింపు తాజా వార్తలు
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా

    నితిన్ గడ్కరీ

    ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం భారతదేశం
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై

    కేంద్రమంత్రి

    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం

    నాగపూర్

    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023