NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
    తదుపరి వార్తా కథనం
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

    వ్రాసిన వారు Stalin
    Mar 21, 2023
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

    దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు.

    జనవరి 14న కూడా దావూద్ సభ్యుడనని గడ్కరీ నివాసం, కార్యాలయానికి ఓ వ్యక్తి ఇలాంటి కాల్స్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. 14వ తేదీన ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య గడ్కరీ పీఆర్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూడు బెదిరింపు కాల్‌లు వచ్చాయి.

    నితిన్

    సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు

    జనవరిలో బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇల్లు, కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే మంత్రిని బాంబుతో సమాధానం చెబుతానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. అయితే కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారి అనే వ్యక్తి అని ఆ తర్వాత పోలీసులు గుర్తించారు.

    మరో సంఘటనలో గడ్కరీని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే ఆరోపణలపై నాగ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్ పోలీసుల సైబర్ సెల్ నిందితుడిపై కేసు నమోదు చేసింది.

    సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసింది దత్తాత్రే జోషి అని తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ
    మహారాష్ట్ర
    నాగపూర్
    ఎంపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    నాగపూర్

    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర

    ఎంపీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025