NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది
    తదుపరి వార్తా కథనం
    Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది
    దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది

    Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సమాజంలో మహిళల భద్రత, గౌరవంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

    ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ మహిళకైనా భద్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితులు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

    ఏదైనా దేశ బలం మహిళల సాధికారతపైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆమె సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 నిర్వహించిన షీశక్తి 2024 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

    వివరాలు 

     ఆడవారి భద్రతకు సంబంధించి కఠినచట్టాలు 

    ''మహిళలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా,ధైర్యం,శక్తితో ముందుకు సాగుతున్నారు.మన దేశంలో మహిళా భద్రత కోసం కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ,దురదృష్టవశాత్తు,భద్రతా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సంప్రదాయవాదం, సామాజిక సంకుచిత భావాల వల్ల మహిళలు వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. సమాజంలో మార్పులు వచ్చినప్పటికీ, కదిలిపోలేని సామాజిక అభిప్రాయాలు మహిళా సమానతకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు సమాజంగా మనం ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం ఉంద'' అని ద్రౌపది ముర్ము అన్నారు.

    వివరాలు 

    "బ్రేకింగ్ బ్యారియర్స్" అనే థీమ్‌తో షీశక్తి కార్యక్రమం 

    మహిళల భద్రత,గౌరవం దేశ ప్రగతికి కీలకమని, అందరం కలిసి మహిళల రక్షణను, మర్యాదను కాపాడడానికి కట్టుబడి ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.

    మనం పుట్టిన ప్రదేశాన్ని తల్లిగా భావించే సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామని, మహిళలను దేవతలుగా పూజించే సాంప్రదాయాన్ని కూడా నిలుపుకురావాలన్నారు.

    మహిళలు నిజమైన శక్తికి ప్రతిరూపాలని, కాళీ, దుర్గ వంటి దేవతల రూపంలో దుష్ట సంహారం చేయగల శక్తిగా, లక్ష్మీ, సరస్వతిలా ఆశీర్వదించే శక్తిగా కొలుస్తామని చెప్పారు.

    ఈ సారి షీశక్తి కార్యక్రమం "బ్రేకింగ్ బ్యారియర్స్" అనే థీమ్‌తో జరుగుతుందని, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని ఆమె చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025