NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    Saffron Vande Bharat: నేడు వారణాసిలో 2వ ఆరెంజ్ కలర్ వందే భారత్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2023
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వారణాసి-న్యూఢిల్లీ మధ్య ఆరెంజ్ కలర్ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు.

    మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధాన మంత్రి ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నట్లు ఉత్తర రైల్వే తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

    రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలో ప్రారంభించబోతున్న రెండవ ఆరెంజ్ కలర్(saffron colour) వందే భారత్ రైలు అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఈ సందర్భంగా ఉత్తర రైల్వే ఆరెంజ్ కలర్ లో ఉన్న రైలు ఫోటోను కూడా షేర్ చేసింది.

    Details 

    రైలులో అనేక కొత్త ఫీచర్లు

    ఈ రైలులో ఆన్‌బోర్డ్ Wi-Fi ఇన్ఫోటైన్‌మెంట్, GPS-ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూజ్డ్ LED లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు,వ్యక్తిగత టచ్-ఆధారిత రీడింగ్ లైట్లు, రోలర్ బ్లైండ్‌లు, వంటి అత్యుత్తమ ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి.

    ఈ ట్రైన్ లో మెరుగైన హీట్ వెంటిలేషన్,ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో పాటు సూక్ష్మక్రిమి లేని గాలి సరఫరా కోసం UV ల్యాంప్‌ ఉంది. ఇంటెలిజెంట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వాతావరణ పరిస్థితులు/ఆక్యుపెన్సీకి అనుగుణంగా శీతలీకరణను సర్దుబాటు చేస్తుందని పేర్కొంది.

    రైలు వారణాసి నుండి న్యూఢిల్లీకి మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది.

    Details 

    సెప్టెంబర్ 24న మొదటి ఆరెంజ్-గ్రే రంగు రైలు ప్రారంభం 

    వారణాసి నుండి ఈరైలు న్యూఢిల్లీకి మధ్యాహ్నం 2:05 గంటలకు చేరుకుంటుంది.అనంతరం 3 గంటలకు వారణాసికి బయలుదేరుతుంది.

    ఇది రాత్రి 11:05 గంటలకు వారణాసి చేరుకుంటుంది.ప్రస్తుతం న్యూ ఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న మొదటి వందే భారత్ రైలు ఢిల్లీ నుండి ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

    ఇది మధ్యాహ్నం 3గంటలకు న్యూఢిల్లీకి బయలుదేరి రాత్రి 11గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇది గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

    మొదటి ఆరెంజ్-గ్రే రంగు వందే భారత్ రైలును సెప్టెంబర్ 24న కేరళలోని కాసరగోడ్- తిరువనంతపురం మధ్య రైల్వేశాఖ ప్రారంభించింది.

    సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఇది ఒకటి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    నరేంద్ర మోదీ

    Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్‎లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి ఆంధ్రప్రదేశ్
    Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ  ఛత్తీస్‌గఢ్‌
    ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు  ఇరాన్
    PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025