NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం
    నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

    Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్‌ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.

    శ్రీనగర్-లేహ్‌ జాతీయ రహదారిపై రూ.2,400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం 6.4 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది.

    ఈ సొరంగం ద్వారా ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి.

    సొరంగ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ రాకను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు.

    ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

    Details

     ఎస్పీజీ భద్రతా చర్యలు 

    భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్‌లు, వైమానిక, సాంకేతిక నిఘాను ఉపయోగిస్తున్నారు. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని శనివారం నుంచి సోమవారం వరకు తాత్కాలికంగా మూసివేశారు.

    జెడ్-మోర్ సొరంగం ప్రారంభోత్సవ వేదికను ఎస్పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    గగాందీర్ ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ర్యాలీ నిర్వహించి ప్రసంగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    సొరంగం ప్రత్యేకతలు

    ఈ సొరంగం పూర్తయిన తర్వాత ఏడాదిలో ఎప్పుడైనా లద్దాఖ్‌కు రోడ్డు మార్గం అందుబాటులో ఉంటుంది.

    ఇది ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊతం ఇచ్చే ప్రాజెక్టుగా నిలవనుంది. సొరంగం ప్రారంభం ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, వ్యాపార కార్యకలాపాలకు సులభతరం అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    జమ్ముకశ్మీర్

    తాజా

    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి

    నరేంద్ర మోదీ

    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ మహారాష్ట్ర
    PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ  భారతదేశం
    PMJAY: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రధాన మంత్రి
    PM Modi: రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మోదీ, అమిత్‌ షా శుభాకాంక్షలు అమిత్ షా

    జమ్ముకశ్మీర్

    Election Results: కాంగ్రెస్‌ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆధిక్యం హర్యానా
    Jammu Kashmir Elections: నామినేటెడ్‌ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ? కాంగ్రెస్
    Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు హర్యానా
    Omar Abdullah: జమ్ముకశ్మీర్ లో ఆధిక్యంలో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌..సెల్ఫీ పోస్టు చేసిన ఒమ‌ర్ అబ్దుల్లా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025