NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు
    అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

    Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    08:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.

    వైట్ హౌస్‌లో ఇద్దరు నాయకులు సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, ఒప్పందాల గురించి సమాలోచనలు చేశారు.

    ఈ పర్యటనలో భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.

    సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ట్రంప్ నినాదమైన "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA)" నకు అనుగుణంగా, భారతదేశ అభివృద్ధి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ "మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ (MIGA)" అనే పదాన్ని ప్రస్తావించారు. మోడీ తన ప్రసంగంలో, ఇండియాను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.

    వివరాలు 

    భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యానికి  500బిలియన్ డాలర్లు 

    ప్రధాని మోదీ, ''MIGA కలిస్తే అది 'MEGA' భాగస్వామ్యాన్ని తీసుకువస్తుంది''అని చెప్పారు.

    ''అమెరికా ప్రజలకు 'MAGA' అంటే ఏంటో బాగా తెలుసు.అలాగే, భారత్ 'వికసిత భారత్ 2047' లక్ష్యంతో ముందుకు సాగుతోందని,అదే అమెరికా భాషలో చెప్పాలంటే 'MIGA' అని అభివర్ణించవచ్చు'' అని వివరించారు.

    ఈ రెండు దేశాల అభివృద్ధి లక్ష్యాలు కలిస్తే,ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే విధంగా అవుతాయని ఆయన అన్నారు.

    2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500బిలియన్ డాలర్ల స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల నాయకులు సంకల్పించారు.

    పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఒప్పందాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

    అలాగే,ఉమ్మడి అభివృద్ధి,ఉమ్మడి ఉత్పత్తి,సాంకేతిక పరిజ్ఞానం మార్పిడిపై రెండూ దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    Omar Abdullah: మోదీ మాట నిలబెట్టుకోవడంతో సీఎం అయ్యా.. ఒమర్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా
    National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్‌ నుంచి ప్రారంభం నిజామాబాద్
    Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ ఇండియా
    PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025