NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం
    దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం

    Delhi Railway Station: దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. 18 మంది దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటనలో పలువురు గాయపడగా, మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 14, 15 ప్లాట్‌ఫాంల వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    అయితే ఇప్పటి వరకు రైల్వే శాఖ నుంచి మృతులపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

    Details

     అనూహ్య రద్దీ కారణంగానే తొక్కిసలాట

    రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వివరించారు.

    ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రద్దీ నియంత్రించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండగా, మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

    అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై గుమిగూడారు.

    ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణంగా తొక్కిసలాటకు దారితీసిందని అధికారులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    దిల్లీ

    Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం  వాయు కాలుష్యం
    Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్‌ భారతదేశం
    Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట భారతదేశం
    AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ అరవింద్ కేజ్రీవాల్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025