తదుపరి వార్తా కథనం

Puri: పూరీ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 29, 2025
09:48 am
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద రథయాత్ర సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, మృతులు ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)లుగా గుర్తించారు. రథయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు గుండిచా ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో పలువురు పడిపోయి గాయపడగా, ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందించనున్నట్టు వెల్లడించారు.