LOADING...
IRCTC: అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ కోచ్‌లో ప్రయాణం.. రైల్వేలో ప్రత్యేక అవకాశం
అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ కోచ్‌లో ప్రయాణం.. రైల్వేలో ప్రత్యేక అవకాశం

IRCTC: అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ కోచ్‌లో ప్రయాణం.. రైల్వేలో ప్రత్యేక అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రైలు ప్రయాణానికి రిజర్వేషన్‌ చేసుకునే సమయంలో అందుబాటులో ఉన్న ఒక కీలక సదుపాయాన్ని చాలామంది గుర్తించకపోవడంతో, విలువైన అవకాశాన్ని కోల్పోతున్నారు. అదే 'ఆటో అప్‌గ్రడేషన్‌' సదుపాయం. ఈ ఆప్షన్‌ గురించి అవగాహన లేక చాలామంది టికెట్‌ బుకింగ్‌ సమయంలో దాన్ని ఎంచుకోకుండా వదిలేస్తున్నారు. దూర ప్రాంతాలకు రైలు ప్రయాణం కోసం రైల్‌వన్‌ యాప్‌ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా సెకండ్‌ స్లీపర్‌ బెర్తును రిజర్వ్‌ చేసుకునేటప్పుడు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి 'ఆటో అప్‌గ్రడేషన్‌'. సెకండ్‌ స్లీపర్‌ బెర్తు బుక్‌ చేసే సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే, రైలు బయల్దేరే వేళ ఖాళీ బెర్తులు ఉన్నట్లయితే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే థర్డ్‌ ఏసీ తరగతిలో ప్రయాణించే అవకాశం స్వయంచాలకంగా లభిస్తుంది.

Details

ఇలా ఏసీ కోచ్ లో ప్రయాణించవచ్చు

ఈ అప్‌గ్రడేషన్‌ వివరాలను రైల్వే శాఖ మీకు మెసేజ్‌ ద్వారా తెలియజేస్తుంది. ఇదే విధంగా, సెకండ్‌ ఏసీ తరగతిలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఖాళీలను బట్టి ఫస్ట్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశం కూడా రావచ్చు. అలాగే సెకండ్‌ సిట్టింగ్‌ టికెట్‌ తీసుకున్న వారికి ఏసీ ఛైర్‌కార్‌లో అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఈ ఆప్షన్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది. కావున రైలు రిజర్వేషన్‌ చేసుకునే సమయంలో 'ఆటో అప్‌గ్రడేషన్‌' ఆప్షన్‌ను తప్పకుండా ఎంపిక చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.

Advertisement