
Earthquake: ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం నమోదైంది.మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫరీదాబాద్లో నమోదైన ఈ భూకంప ప్రభావంతో ఢిల్లీలోనూ భూమి కొద్దిసేపు కంపించింది. భూ అంతర్భాగంలో సుమారు 5కిలోమీటర్ల లోతులో భూ కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(NCS)తెలిపింది. తెల్లవారుజామున జరిగిన ఈ భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇక మరోవైపు,అండమాన్ సముద్రంలో కూడా భూకంపం చోటుచేసుకుంది.సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో అక్కడ భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత 4.4గానమోదైనట్టు ఎన్సీఎస్ తెలిపింది.భూ అంతర్భాగంలో 10కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ,హర్యానాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు
EQ of M: 3.2, On: 22/07/2025 06:00:28 IST, Lat: 28.29 N, Long: 77.21 E, Depth: 5 Km, Location: Faridabad, Haryana.
— National Center for Seismology (@NCS_Earthquake) July 22, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/cNmktjSfUH