NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు
    తదుపరి వార్తా కథనం
    బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు
    ఆందోళనలో 9.5 లక్షల మంది అభ్యర్థులు

    బయోమెట్రిక్ హాజరు లేకుండానే  గ్రూప్ 4 పరీక్ష.. ఆందోళనలో అభ్యర్థులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    11:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు బయోమెట్రిక్ హాజరు లేకుండానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఎగ్జామ్ కు రంగం సిద్ధం చేసింది.

    ఇటీవలే గ్రూప్ 1 పరీక్షలోనూ బయోమెట్రిక్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహించింది. అయితే కమిషన్ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

    పరీక్ష నిర్వహణలో పటిష్టమైన చర్యలను అమలు చేయకపోవడానికి గల కారణాలను హైకోర్టు ఆరా తీసింది. పోటీ పరీక్షలకు బయోమెట్రిక్ హాజరును ఎందుకు తీసుకోవట్లేదని కమిషన్ ను నిలదీసింది.

    అయినప్పటికీ తాజా గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహణలోనూ టీఎస్పీఎస్సీ పాత ధోరణతోనే కొనసాగుతుండటంపై అభ్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

    DETAILS

    9.51 లక్షల మందికి బయోమెట్రిక్ అటెండెన్స్ సాధ్యం కాదు : టీఎస్​పీఎస్సీ 

    పోటీ పరీక్షల నిర్వహణను ఖర్చుల కోణంలో చూడకూడదని, ఫలితంగా లొసుగులకు అవకాశం ఇవ్వొద్దని సూచనలు చేసింది.

    పరీక్షల నిర్వహణలో గత కొన్నాళ్లుగా కమిషన్ ఇదే విధానాన్ని అమలు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

    ఓఎంఆర్ షీట్లపై హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకపోతే వాటిని మార్చి తారుమారు చేసే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మరోవైపు దీనికి స్పందించిన కమిషన్ ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందునే బయోమెట్రిక్ హాజరు సహా ఓఎంఆర్ అమలు చేయట్లేదని కమిషన్ అధికారులు వెల్లడించడం గమనార్హం.

    రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టులకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లో 2,846 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    తెలంగాణ

    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  మేడ్చల్
    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం ఆంధ్రప్రదేశ్

    ప్రభుత్వం

    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పాకిస్థాన్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025