Page Loader
TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2024
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురయ్యాయి. జాతీయ రహదారులు కొట్టుకు పోవడంతో,ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయి, ప్రయాణికులు కష్టాలకు లోనయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు 10% రాయితీని అందిస్తున్నట్లు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ రాయితీ అన్ని ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులకు వర్తిస్తుందని, ముందస్తు రిజర్వేషన్స్ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://www.tgsrtcbus.in ను ఉపయోగించాలని అధికారులు సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సజ్జనార్ చేసిన ట్వీట్