NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు 
    తదుపరి వార్తా కథనం
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు 
    ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు

    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు 

    వ్రాసిన వారు Stalin
    Apr 27, 2023
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

    సాధారణ, మెట్రో బస్సులతో సహా ఆర్టీసీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించేందుకు అందించే టీ-24 టికెట్ ధరను రూ.100నుంచి రూ.90కు తగ్గించినట్లు పేర్కొంది. అలాగే తగ్గించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

    అంతేకాకుండా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు టీ-24 టిక్కెట్ ధరల్లో 20శాతం రాయితీ అందిస్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సీనియర్ సిటిజన్‌లకు టీ-24టిక్కెట్‌ను రూ. రూ. 80లకే ఆర్టీసీ అందిస్తోంది.

    అయితే, సీనియర్ సిటిజన్లు టికెట్ తీసుకునే సమయంలో వయస్సు ధృవీకరణ కోసం బస్ కండక్టర్లకు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది.

    తెలంగాణ

    రోజుకు 25వేల టీ-24 టిక్కెట్ల విక్రయం

    టీ-24 టిక్కెట్‌పై ప్రయాణీకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజూ సగటున 25,000 టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి.

    లీటరు పెట్రోల్ కంటే తక్కువ ఖర్చుతో 24గంటల ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులకు అందించడానికి టీ-24 టికెట్ ధరను తగ్గించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

    గతంలో టీ-24 టికెట్ ధర రూ.120ఉండగా, దాన్ని ఇటీవల రూ.100కు తగ్గించారు.

    అలాగే టీఎస్ ఆర్టీసీ మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టిక్కెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.50తో టికెట్ తీసుకుంటే మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య నగరంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

    అలాగే ఎఫ్-F-24 టిక్కెట్‌ను రూ. 300తో కొనుగోలు చేస్తే నలుగురితో కూడిన కుటుంబం 24 గంటల పాటు హైదరాబాద్ మొత్తం ప్రయాణించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలంగాణ

    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైకోర్టు

    హైదరాబాద్

    తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు పెట్టుబడి
    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు వాయు కాలుష్యం
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్
    TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ ప్రయాణం

    తాజా వార్తలు

    ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ సూడాన్
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025