LOADING...
Madras High Court: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు 'విద్వేషపూరిత ప్రసంగమే': మద్రాస్ హైకోర్టు 
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు 'విద్వేషపూరిత ప్రసంగమే': మద్రాస్ హైకోర్టు

Madras High Court: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు 'విద్వేషపూరిత ప్రసంగమే': మద్రాస్ హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదానికి కారణమయ్యాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు, ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషభరిత ప్రసంగమేనని స్పష్టం చేసింది. హైకోర్టు, ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ, భాజపా నాయకుడు అమిత్ మాలవీయ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్టుపై దాఖలైన కేసును రద్దు చేసింది. 2023లో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకంగా మాలవీయ చేసిన పోస్ట్ నేరం కిందకి రాదని హైకోర్టు పేర్కొంది. సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రజలను లక్ష్యంగా చేసిన ఉదయనిధి ప్రసంగానికి, మాలవీయ ప్రతిస్పందన మాత్రమేనని హైకోర్టు స్పష్టంచేసింది.

వివరాలు 

ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు 

అలాగే, హైకోర్టు ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగాల శ్రేణిలోపే వస్తాయని తేల్చిచెప్పింది. తమిళనాడులో ఎటువంటి కేసులు నమోదు కాలేదని, కానీ ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదు అయిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. సెప్టెంబర్ 2023లో తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు, వివాదాలు చోటుచేసుకున్నాయి.

Advertisement