NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది
    తదుపరి వార్తా కథనం
    Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది
    Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది

    Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి.

    అరారియా, సివాన్ తర్వాత ఇప్పుడు మోతిహారిలో మరో వంతెన కూలిపోయింది.

    మోతీహరిలోని ఘోరసహన్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన నేటి తెల్ల‌వారుఝామున కూలిపోయింది.

    ఈ వంతెనపై ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. రూ.1.5 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.ఈ వంతెన దాదాపు నిర్మాణం పూర్తయింది.

    అంవా నుండి చైన్‌పూర్ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

    అరారియాలోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన జూన్ 18న కుప్పకూలింది. జూన్ 22న సివాన్‌లోని గండక్ కెనాల్‌పై వంతెన కూలిపోయింది.

    వివరాలు 

    అర్ధ‌రాత్రి కూలిన వంతెన 

    దాదాపు 40 అడుగుల విస్తీర్ణంలో ఈ వంతెనను నిర్మించనున్నట్లు సమాచారం.వంతెన కోసం కాస్టింగ్ రాత్రి చీకటిలో జరుగుతోంది.

    అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఒక్క‌సారిగా ఈ వంతెన కూలిపోయింది.

    సిమెంట్, ఇసుక సరిగ్గా సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండడంతో వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

    వివరాలు 

    బ్రిడ్జినిర్మాణం డబ్బుల సంపాదన కోసమా లేక ప్రజల కోసమా? 

    రాష్ట్రంలో నిత్యం బ్రిడ్జిలు కూలిపోతుండడంతో బ్రిడ్జిని డబ్బుల సంపాదించడం కోసం నిర్మిస్తున్నారా.. లేక నిజంగానే ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మిస్తున్నారా అనే అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి.

    ఎందుకంటే వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడం మామూలు విషయం కాదు.

    దీనికి ముందు, ఇటీవల అరారియా, సివాన్‌లలో కూడా రెండు వంతెనలు కూలిపోయాయి.

    ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, వంతెన కూలిన సమయంలో ఆ వంతెనపై ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిహార్

    Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే? ఇండియా
    Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ  లోక్‌సభ
    Land-for-jobs scam: ED చార్జిషీట్‌లో రబ్రీ దేవి, మిసా భారతి పేర్లు భారతదేశం
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' భారతరత్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025