NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
    ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!

    Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

    ఇటీవల భోపాల్ నుంచి దిల్లీకి విమాన ప్రయాణం చేయడానికి ఆయన టికెట్ బుక్ చేసుకోగా, విరిగిపోయిన సీటు ఆయనకు కేటాయించారు.

    విమానంలోని మరికొన్ని సీట్ల పరిస్థితి కూడా అలాగే ఉండగా, మంత్రి అదే సీటులో కూర్చొని 1.30 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది.

    ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నుండి దిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఏఐ436 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు.

    Details

    చాలా  సీట్లు విరిగిపోయాయి

    అయితే, సంస్థ ఆయనకు 8С నెంబర్ సీటును కేటాయించింది. విమానం ఎక్కిన వెంటనే తన సీటు విరిగిపోయినదిగా గుర్తించారని తెలిపారు.

    ఇది చూసి ఆశ్చర్యపోయిన మంత్రి వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, యాజమాన్యం ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించినట్లు సమాధానమిచ్చిందని చెప్పారు.

    అంతేకాకుండా ఆ సీటును ప్రయాణికులకు కేటాయించకూడదని ముందుగా ఆదేశించినట్లు కూడా తెలియజేశారని వివరించారు.

    ఈ ఒక్క సీటే కాదు, విమానంలో పలు సీట్లు కూడా పాడైపోయినట్లు గుర్తించానని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

    Details

    ప్రయాణికులను మోసం చేయడం అన్యాయం

    ఈ సమస్యను గమనించిన తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని కోరినప్పటికీ, వారిని అసౌకర్యానికి గురిచేయకుండా తానే విరిగిన సీటులో కూర్చొని 1.30 గంటల పాటు ప్రయాణం చేసినట్లు వెల్లడించారు.

    ఈ పరిస్థితిని ఆయన విమర్శిస్తూ, ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.

    ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ చేపట్టిన తర్వాత సేవలు మెరుగుపడతాయని భావించానని, కానీ ఇది కేవలం అపోహగానే మిగిలిందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శివరాజ్ సింగ్ చౌహాన్
    ఎయిర్ ఇండియా

    తాజా

    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం
    China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు.. అమెరికా
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం

    శివరాజ్ సింగ్ చౌహాన్

    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు మధ్యప్రదేశ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు మధ్యప్రదేశ్
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ  మధ్యప్రదేశ్

    ఎయిర్ ఇండియా

    ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న  ప్రయాణికుడు దిల్లీ
    Air India New Logo: ఎయిర్ ఇండియాకు నయా లోగో.. ఎలా ఉందంటే? టాటా
    ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్  ముంబై
    ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్ డీజీసీఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025