NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట! 
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట! 
    'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట!

    Uttar Pradesh: 'యూపీలో విచిత్ర ఘటన'.. నిందితుడి బదులుగా జడ్జి కోసం యుపి పోలీసులు వేట! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఓసబ్‌ ఇన్‌స్పెక్టర్ చేసిన చిన్న పొరపాటు న్యాయవ్యవస్థను ఆశ్చర్యపరిచే స్థితికి తీసుకెళ్లింది.

    నిందితుడికి నోటీసులు ఇవ్వాల్సిన చోట,న్యాయమూర్తికే వాటిని అందజేయాలని పోలీసులు ప్రయత్నించడం పట్ల న్యాయమూర్తి తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఫిరోజాబాద్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్‌ అనే పోలీసు అధికారి ఒక దొంగతనం కేసులో కోర్టు జారీ చేసిన నోటీసులను నిందితుడికి అందజేయాల్సి ఉంది.

    కానీ,అతడు చేసిన పొరపాటు వల్ల నిందితుడి పేరు బదులు,కోర్టు న్యాయమూర్తి నగ్మా ఖాన్‌ పేరే నోటీసులో రాసేశాడు.

    ఈనోటీసులను సంబంధిత వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో బన్వారిలాల్‌ తగిన చిరునామాకు వెళ్లాడు.

    అక్కడ"నగ్మా ఖాన్"అనే వారు ఎవరూ లేరని తెలియడంతో,అతను తిరిగి వచ్చి అదే విషయాన్ని జడ్జి నగ్మా ఖాన్‌కి నివేదించాడు.

    వివరాలు 

    బన్వారిలాల్‌పై తగిన చర్యలు

    ఈ విషయం విన్న న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

    పోలీసు అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపుతూ, ''కోర్టు ఎవరికీ నోటీసులు పంపించాలో, ఏ సందర్భంలో పంపాలో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.నోటీసులను చదవకుండానే ఈ విధంగా పనిచేయడం బాధాకరం.నోటీసులను అందజేసే బాధ్యత గల వ్యక్తులు పూర్తి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇటువంటి పొరపాట్లు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు'' అని వ్యాఖ్యానించారు.

    ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచిస్తూ, బన్వారిలాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసు డైరెక్టర్ జనరల్‌కి ఆదేశాలు ఇచ్చారు.

    ఈ సంఘటన కొన్ని రోజుల క్రితమే జరిగినా, తాజాగా వెలుగులోకి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Kumbh Mela 2025: మహా కుంభంలో మౌని అమావాస్య వేళ..  భక్తులకు అడ్వైజరీ  జారీ చేసిన అధికారులు  భారతదేశం
    Kumbhamela: మహా కుంభమేళాలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి 15 మంది మృతి! భారతదేశం
    Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు  భారతదేశం
    Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025