LOADING...
Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  
యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు

Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ తీర్పుతో అలహాబాద్ హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొని దానిని రద్దు చేసింది. అది లౌకికవాద భావనకు వ్యతిరేకమని పేర్కొంది. ఆ తీర్పును సవాలు చేస్తూ, కేసు సుప్రీంకోర్టు వద్దకు చేరింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు సరైనది కాదని, ఈ తీర్పు 10వేల మంది మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. తాజా తీర్పుతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మదర్సా ఎడ్యుకేషన్‌ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 

Advertisement