Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్లోని వేలాది మదర్సాలకు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది.
యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
ఈ తీర్పుతో అలహాబాద్ హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.
అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తర్ప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొని దానిని రద్దు చేసింది.
అది లౌకికవాద భావనకు వ్యతిరేకమని పేర్కొంది. ఆ తీర్పును సవాలు చేస్తూ, కేసు సుప్రీంకోర్టు వద్దకు చేరింది.
సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు సరైనది కాదని, ఈ తీర్పు 10వేల మంది మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.
తాజా తీర్పుతో ఉత్తర్ప్రదేశ్లోని 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మదర్సా ఎడ్యుకేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు
#WATCH | Supreme Court upholds constitutional validity of 'Uttar Pradesh Board of Madrasa Education Act 2004’.
— ANI (@ANI) November 5, 2024
In Lucknow, SP spokesperson Ameeque Jamei says, "People across the country are welcoming this decision of the Supreme Court. This Govt neither wants the Madrasas to… pic.twitter.com/72lzw4yMpw