Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన యువకుడు
ఉత్తర్ప్రదేశ్ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు. తొలుత రియాజ్(22), అతని సోదరి ఆషిఫా(18) మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రియాజ్ తన చెల్లిని హత్య చేశాడు. అయితే ఆషిఫా ప్రేమ వ్యవహారం వల్లే రియాజ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. యువతి తల నరికిన ప్రదేశానికి పోలీసు బృందం వెంటనే చేరుకొని అవసరమైన ఆధారాలు సేకరించించింది. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ హత్యపై పోలీసులు ఏం చెప్పారంటే!
రియాజ్ తన సోదరి సోదరి తల నరికివేయడానికి పదునైన ఆయుధాన్ని ఉపయోగించాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అశుతోష్ మిశ్రా తెలిపారు. ఆషిఫా ఇటీవల అదే గ్రామానికి చెందిన తన ప్రియుడు చాంద్ బాబుతో కలిసి పారిపోయిందని ఏఎస్పీ చెప్పారు. అయితే, మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆషిఫాను కొన్ని రోజుల తర్వాత గుర్తించారు. ఆ తర్వాత బాబును జైలుకు పంపారు. అప్పటి నుంచి రియాజ్, ఆషిఫా మధ్య వాగ్వాదం జరుగుతోంది. తన సోదరి ప్రేమ వ్యవహారం విషయంలో ఇద్దరు తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే రియాజ్ క్షణికావేశంలో తన సోదరిని దారణంగా హత్య చేసినట్లు చెప్పారు.