NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు
    గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం

    Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేన్పురి జిల్లాలో ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఈ రోజు (బుధవారం) పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

    ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతిని హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

    ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి.

    ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని కొన్ని ఓటర్లతో చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

    అందువల్లే ఆమెను హత్య చేసినట్టు వారు అభిప్రాయపడుతున్నారు.

    కర్హల్‌లో జరిగిన ఈ దళిత యువతి హత్యకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

    వివరాలు 

    నగ్నంగా యువతీ మృతదేహం 

    ఈ హత్యను సమాజ్‌వాదీ పార్టీ నేత చేశారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.

    పలు మీడియా కథనాల ప్రకారం, ఆ యువతీ మృతదేహం నగ్నంగా లభ్యమైంది. ఆమెకు ఇటీవల బెదిరింపులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

    ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని, ఆ తరువాత ఆమె మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కన్పించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

    వివరాలు 

    కర్హల్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్

    మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, "ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడు. అయితే మా కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది. దీంతో ఆ నేత, అతని సహచరులు మా కుమార్తెను బెదిరించారని, ఆ తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది" అని తెలిపారు.

    ఈ రోజు (బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం.

    ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారని తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    #NewsBytesExplainer: ప్రేమ ఉచ్చులో చిక్కుకుని ఎవరైనా మతం మారితే జీవితాంతం జైల్లోనే గడుపుతారు.. ఈ చట్టం గురించి తెలుసుకోండి  భారతదేశం
    Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం ఇండియా
    అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కేసు వివరాలు ఇవే! అయోధ్య
    UP Encounter: ముఖ్తార్ అన్సారీ షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో మృతి  ఎన్‌కౌంటర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025