NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌
    తదుపరి వార్తా కథనం
    UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌
    మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌

    UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ (Uttar Pradesh State Women Commission) పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతో బాటు 'బ్యాడ్ టచ్' నుంచి మహిళలను రక్షించడంలో కీలక ప్రతిపాదనలు చేసింది.

    కమిషన్ పురుష దర్జీలు మహిళల దుస్తుల కొలతలు తీసుకోకూడదని, అమ్మాయిల శిరోజాలు కత్తిరించే పనులు చేయకూడదని సూచించింది.

    మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ ఈ ప్రతిపాదనలు ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు.

    హిమానీ అగర్వాల్ ప్రకారం, "ఇలాంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకడం ద్వారా వేధించేందుకు అవకాశాలున్నాయి. అలాంటి వాటి నుంచి మహిళలను రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం" అని తెలిపారు.

    వివరాలు 

    కమిషన్ ప్రతిపాదనలు

    మహిళల దుస్తుల కొలతలు తీసుకోవడానికి మహిళా సిబ్బందినే నియమించాలి. ఇవి జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.

    సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు కేవలం మహిళా సిబ్బందే సేవలందించాలి.

    జిమ్, యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే ఉండాలి. అలాంటి సెంటర్లను అవసరమైతే వెరిఫికేషన్ చేయాలి.

    స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయిని ఉండాలి.

    డ్యాన్స్, డ్రామా వంటి కళా కేంద్రాల్లో అమ్మాయిలకు మహిళా టీచర్లే ఉండాలి.

    మహిళా వస్తువులను విక్రయించే దుకాణాల్లో కేవలం మహిళా సిబ్బందే ఉండాలి.

    కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి.

    వివరాలు 

    వైరల్ అవుతున్న ప్రతిపాదనలు  

    ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వీటిని అమలు చేయడానికి చట్టం తీసుకురావాలని యూపీ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హిమానీ అగర్వాల్ తెలిపారు.

    ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttarpradesh: నిన్న ఒక్కరోజే ఉత్తర్‌ప్రదేశ్‌లో పిడుగుపాటుకు 38 మంది మృతి భారతదేశం
    Heavy Rains : యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం.. 11 మంది మృతి భారతదేశం
    IAS: పూజా ఖేద్కర్ తర్వాత, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ టార్గెట్ .. xలో వివరణ భారతదేశం
    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క లక్నో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025