
BRS: బీఆర్ఎస్లో కలకలం.. మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరికకు రెడీ?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి రోజురోజుకీ వేడెక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అసెంబ్లీలో చర్చకు వస్తే, బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ తగలొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ నివేదిక ప్రభావంతో పార్టీ పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు ఈ నేతలు సిద్ధమవుతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారాన్ని కోల్పోయి ఏడాది గడవకముందే కారు పార్టీ (బీఆర్ఎస్)లో కలకలం మొదలైంది. ముఖ్య నేతలపై కేసులు వేగంగా పురోగమిస్తుండటంతో, కొందరు ముందుగానే తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని చూస్తున్నారు.
Details
బీజేపీ చేరేందుకు ఆసక్తి
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. రేపో మాపో మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా కమలం గూటికి చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరిలో మిగిలిన వారు కూడా బీజేపీ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. కాళేశ్వరం నివేదిక చర్చకు వస్తే, కేసీఆర్, హరీష్రావులకు సమస్యలు తలెత్తవచ్చని భావన బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు కొన్ని నేతలను వేధిస్తుండగా, ఫార్ములా కేసు వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు బిగుస్తోందని అంటున్నారు.
Details
గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధ్యక్షుడు
పరిస్థితిని అంచనా వేసిన నేతలు ముందుగానే తమ బస్తాలు సర్దుకుని వలసకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. "మా పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ నుంచి దాదాపు డజను మంది నేతలు సిద్ధంగా ఉన్నారు, అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. మాజీ నేతలు వరుసగా పార్టీలు మారుతుండటంతో, బీఆర్ఎస్లో గందరగోళం నెలకొంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.