Page Loader
Dog Incident:హైదరాబాద్‌లో కలకలం.. యజమానిని చంపిన పెంపుడు కుక్క! 
హైదరాబాద్‌లో కలకలం.. యజమానిని చంపిన పెంపుడు కుక్క!

Dog Incident:హైదరాబాద్‌లో కలకలం.. యజమానిని చంపిన పెంపుడు కుక్క! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణం తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పవన్ కుమార్ అనే యువకుడిని అతడి స్వంత పెంపుడు కుక్క దాడిచేసి చంపేసింది. ఇది మాత్రమే కాకుండా, కుక్క అతడి శరీర భాగాలను తినేయడం ఈ ఘటనను మరింత భయానకంగా మార్చింది. ఈ విషయంలో పవన్ కుమార్ స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. తన మిత్రుడి ఇంటికి వెళ్లినప్పుడు తలుపు తట్టినా పవన్ స్పందించలేదని, అనుమానం వచ్చి డోర్ బలవంతంగా తెరిచి లోపలకి వెళ్లగానే చూసిన దృశ్యంలో షాక్‌కు గురయ్యానని అతడు తెలిపాడు.

Details

కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి

పవన్ కుమార్ రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉండగా, అతడి పెంపుడు కుక్క నోటికి పూర్తిగా రక్తం అంటుకుని కనిపించిందని వెల్లడించాడు. మధురానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, కుక్క పవన్ మర్మాంగాలను గాయపరిచిన దాడితోనే అతడి మృతి జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటన మధురానగర్ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన తెలిసిన తర్వాత స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులను ప్రేమతో పెంచడమే కాకుండా, వాటి ఆచరణల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ప్రతి పెంపుడు కుక్క యజమానికి హెచ్చరికగా నిలుస్తోంది.