Page Loader
Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Dec 12, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. పౌరసరఫరాల శాఖ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ నిర్వహణలో విఫలమైందన్నారు. ఫలితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం రుణాలు రూ.56,000 కోట్లకు చేరాయని, వడ్డీ భాగం రూ.3,000 కోట్లకు చేరుకుందని అన్నారు. 12శాతం మంది రేషన్‌కార్డులు ఉపయోగించలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తమ్

కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలోనే నిర్ణయం: మంత్రి ఉత్తమ్ 

కొత్త రేషన్‌కార్డుల జారీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ వివరించారు. కార్పొరేషన్‌కు చెందిన రూ.18,000 కోట్ల విలువైన 8.8 మిలియన్‌ టన్నుల వరిధాన్యం మిల్లర్ల వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేదా బ్యాంకు గ్యారెంటీ లేకుండా పడి ఉందన్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి మంత్రివర్గంలో తగిన నిర్ణయం తీసుకుంటామని రెడ్డి చెప్పారు. గత తొమ్మిదిన్నరేళ్లలో (బీఆర్‌ఎస్‌ పాలన) వ్యవస్థాగత లోపాలు ఉన్నాయన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు అందజేస్తున్న కిలో బియ్యంపై రాష్ట్ర, కేంద్రం రూ.39 వెచ్చిస్తున్నందున ప్రజాపంపిణీ విధానంలో అందజేసే బియ్యం అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.