NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం
    ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం

    ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2023
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె కుమార్తె (20) మరణించారు.

    అయితే ఈ ఘటనపై పోలీసులు, గ్రామస్థులు భిన్న వాదనలు వినిస్తున్నారు. ఇద్దరు ఇంట్లో ఉండగానే పోలీసులు నిప్పు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, వారు తమను తాము నిప్పంటించుకున్నారని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

    పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఇప్పటి వరకు 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. అభియోగాలు మోపబడిన వారిలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్

    ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడానికి బుల్‌డోజర్లతో వచ్చారు: గ్రామస్థులు

    కాన్పూర్ దేహత్ జిల్లా రూరా ప్రాంతంలోని మదౌలి గ్రామంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.

    అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడానికి బుల్‌డోజర్లతో వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

    ఇంటి లోపల కుటుంబ సభ్యులు ఉండగానే నిప్పు పెట్టారని, తాము తప్పించుకోగలిగామని, తన తల్లి ప్రమీలా దీక్షిత్, సోదరి నేహాను రక్షించుకోలేకపోయమని బాధిత కుటుంబ సభ్యుడు శివమ్ దీక్షిత్ చెప్పారు. అధికారులు తమ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు ఆయన ఆరోపించారు.

    అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025