NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది 
    తదుపరి వార్తా కథనం
    Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది 

    Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 16, 2023
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ-సహర్సా వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

    రైలు ఢిల్లీ నుండి బిహార్‌లోని సహర్సాకు వెళుతుండగా, తెల్లవారుజామున 2:30 గంటలకు ప్యాంట్రీ కారు సమీపంలోని S6 కోచ్‌లో మంటలు చెలరేగాయని రైల్వే CO, ఉదయ్ శంకర్ తెలిపారు.

    మంటలు చెలరేగడానికి కారణం ఏమిటో వెంటనే తెలియరాలేదు. కొంతమంది వ్యక్తులు నీటి బకెట్లతో కోచ్‌పై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

    ప్యాంట్రీ కారుకు సమీపంలో ఉన్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. 19 మంది గాయపడ్డారు. మంటలు ఎందుకు చెలరేగాయనే దానిపై విచారణ జరుగుతుందని శంకర్ తెలిపారు.

    Details 

    అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం 

    శ్వాసకోశ సమస్యల కారణంగా పదకొండు మందిని పిజిఐకి రిఫర్ చేసినట్లు శంకర్ తెలిపారు.

    మిగిలిన ఎనిమిది మంది స్వల్ప కాలిన గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చేరారని ఆయన తెలిపారు.

    ఇటావాలో రైలులో అగ్నిప్రమాదానికి సంబంధించిన రెండవ సంఘటన ఇది. బుధవారం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు కోచ్‌లలో మంటలు చెలరేగాయి.

    ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి), ఇటావా తెలిపారు.

    మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, రైలులో సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    రైలు ప్రమాదం

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య హత్య
    హిందూ మతమనేదే లేదు, అదంతా ఓ బూటకం.. స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రపతి
    హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి  మహిళ
    ఉత్తర్‌ప్రదేశ్: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలికలు  విద్యార్థులు

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025