NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు
    ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు

    Uttarakhand: ఉత్తరాఖండ్ విషాదం.. నలుగురు మృతి, ఐదుగురి కోసం గాలింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ఈ దుర్ఘటనలో 55 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా, భారత ఆర్మీ ఇప్పటివరకు 50 మందిని రక్షించింది.

    అయితే వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

    జోషిమఠ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందగా, ఇంకా ఐదుగురిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

    ఈ ఘటన బద్రీనాథ్‌కు సమీపంలోని ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం జరిగింది.

    Details

    హెలికాప్టర్ల సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు

    భారత్‌-టిబెట్‌ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం దేశానికి చెందిన చివరి గ్రామంగా గుర్తింపు పొందింది.

    జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న సమయంలో సరిహద్దు రహదారుల సంస్థ (BRO) సిబ్బందిపై ఈ ప్రమాదం సంభవించింది.

    సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో దట్టమైన మంచు వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

    నిన్న 33 మందిని, ఈ రోజు 17 మందిని ఆర్మీ సురక్షితంగా కాపాడింది.

    హెలికాప్టర్ల సహాయంతో గాయపడిన వారిని జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    ఇండియా

    తాజా

    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్

    ఉత్తరాఖండ్

    Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం తాజా వార్తలు
    Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం  ఇండియా
    Uttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్‌లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు  తాజా వార్తలు
    Uttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు  తాజా వార్తలు

    ఇండియా

    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి ఉత్తర్‌ప్రదేశ్
    Dr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత భారతదేశం
    GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు మహారాష్ట్ర
    Sri Panchami, Vasantha Panchami: శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే? లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025